భవానీ నగర్‌లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం

భవానీ నగర్‌లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం

నాచారం, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ లో భవానీ నగర్ వీధి నెంబర్‌–2లో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి భక్తి మార్గం సమాజానికి శాంతి, క్రమశిక్షణ, ఐక్యతను అందిస్తుందన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మోహన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .