డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలతో మనుస్మృతి దహన కార్యక్రమం
ఏ ఎస్ రావునగర్, డిసెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్ చౌరస్తా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి దహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1927లో డిసెంబర్ 25న మనుస్మృతిని సామూహికంగా దహనం చేసి, భారతదేశంలో కులవాదంపై పోరాటానికి పునాదులు వేశారు. మనుషులను సమానంగా చూడకపోవడాన్ని నిరసిస్తూ, మనువాద ప్రతులను తగలబెట్టిన ఆయన దళిత, నిర్లక్ష్యిత వర్గాల హక్కుల కోసం స్ఫూర్తిదాయకంగా నిలిచారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. సామాజిక ఉద్యమ నాయకులు పి. మల్లేశం మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను కల్పించినప్పటికీ, నేటి పాలకులు మనువాదాన్ని తిరిగి స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు దీనికి వ్యతిరేకంగా గట్టిగా ఆవాజ్ వేయాలి” అన్నారు.
సామాజిక నాయకులు జయరాజు, గుమ్మడి హరి ప్రసాద్, శివన్నారాయణ, గొడుగు యాదగిరిరావు ప్రసంగించారు. అనంతరం మనుస్మృతి ప్రతులను తగలబెట్టి, “మనువాదం నశించాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి” అనే నినాదాలు వినిపించాయి.ఈ కార్యక్రమంలో బాలు, గిరీష్, ఎం. భాస్కర్ రావు, పి. మల్లేశం, గుమ్మడి హరి ప్రసాద్,జయరాజ్, శివన్నారాయణ, రుక్కయ్య తదితరులు పాల్గొన్నారు. 


Comments