పొన్నకల్ నూతన సర్పంచ్ మైమూద్‌ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు 

పొన్నకల్ నూతన సర్పంచ్ మైమూద్‌ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకులు 

అడ్డాకల్,డిసెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి పొన్నకల్ మైమూద్ (తెలంగాణ ఉద్యమ కారుడు)ను గ్రామ ప్రజలు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా బలీదు పల్లి, వెలటూర్ గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మైమూద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, మల్లక్ సురేష్ కుమార్ (వెలటూర్ బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు), నాయకులు శ్రీధర్ యాదవ్, మంగరాయి వెంకటేష్, వంకని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .