వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు శాంత కుమార్
వనపర్తి,డిసెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను వనపర్తి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు శాంత కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన సీనియర్ నాయకులు పొనుగంటి భరత్ ప్రసాద్ గారు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు పాల్గొని ప్రసంగించారు. వాజ్పేయి సేవలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ సమావేశంలో పెద్దమందడి మండల మాజీ అధ్యక్షుడు రమేష్ ప్రత్యేకంగా పాల్గొని, ముఖ్య అతిథులు మరియు సీనియర్ నాయకులను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పాల్గొనడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.వాజ్పేయి ఆశయాలనుప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.


Comments