జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

రెండవ రోజు రిలే నిరాహార దీక్షకు వివిధ పార్టీల నేతల మద్దతు

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలి

కాప్రా, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. జమ్మిగడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ దీక్షకు ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భారీగా మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న జమ్మిగడ్డ సాధన సమితి సభ్యులను మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఎస్‌ఎస్ సెల్ అధ్యక్షుడు పత్తి కుమార్, బీజేపీ ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు కనుకుల రజనీకాంత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, జమ్మిగడ్డ సాధన సమితి చేపట్టిన న్యాయమైన పోరాటానికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగాలని వారు సూచించారు.దీక్షకారులు మాట్లాడుతూ, జమ్మిగడ్డ ప్రాంతంలో ప్రస్తుతం 30 వేలకుపైగా ఓటర్లు ఉండగా, దాదాపు 50 వేల మంది జనాభా నివసిస్తున్నారని తెలిపారు. ఓటింగ్ శాతం కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా నమోదవుతుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇప్పటికీ మౌలిక వసతులు, ముఖ్యంగా స్మశానవాటిక, పారిశుద్ధ్యం, త్రాగునీరు, రహదారులు, పరిపాలనా సేవలు సరైన స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని దీక్షకారులు డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి