పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో అధికారుల ఆదేశం

పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

మేడ్చల్ మల్కాజ్గిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ (పిసిపిఎన్‌డిటి) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ప్రైవేట్ వైద్యసంస్థల్లో పిసిపిఎన్‌డిటి (గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ చట్టం) నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్, రీన్యువల్ ప్రక్రియలపై సమగ్రంగా చర్చించారు.ఇటీవల నిర్వహించిన తనిఖీల నివేదికలు, తీసుకున్న చర్యలపై అధికారులు వివరించారు. స్కాన్‌లు నిర్వహిస్తున్న ప్రతి ప్రైవేట్ వైద్యసంస్థ తప్పనిసరిగా పిసిపిఎన్‌డిటి రిజిస్ట్రేషన్ / రీన్యువల్ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.లింగ నిర్ధారణ లేదా పిసిపిఎన్‌డిటి చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సమావేశంలో హెచ్చరించారు.నిబంధనల అమలు, రికార్డుల నిర్వహణ, ప్రమాణాలు, పరికరాలు, మానవ వనరులు, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలపై వైద్యసంస్థలకు ఇవ్వాల్సిన సూచనలను కమిటీ నిర్ణయించింది.ఈ సందర్భంగా కొత్తగా దాఖలైన మరియు రీన్యువల్ అప్లికేషన్లను కమిటీ పరిశీలించి ఆమోదించి, తదుపరి ఉత్తర్వుల కోసం జిల్లా కలెక్టర్‌కు పంపింది. అలాగే పిసిపిఎన్‌డిటి, సరోగసి, ఎంటిపి (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) అంశాలపై కూడా చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసింది.సమావేశానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి & కమిటీ కన్వీనర్ డా. ఉమా గౌరి, గైనకాలజిస్ట్ డా. స్వర్ణలత, జనిటిసిస్ట్ డా. స్వర్ణలత, ప్రోగ్రాం అధికారులు డా. గీత, డా. పవన్, డిప్యూటీ డెమో వసంత రెడ్డి, సెక్షన్ సిబ్బంది హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి