రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం!

ఇద్దరు యువకులకు గాయాలు.

రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం!

సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్కపురి లోకేష్ (24), ఇలాసారపు పవన్ (23) స్కూటీపై సత్తుపల్లి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి మరో బైక్ అతివేగంగా వచ్చి ఢీకొని ఘటన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో లోకేష్‌కు ఎడమ కాలు విరిగిపోగా, పవన్‌కు ఎడమ పాదానికి లోతైన గాయం అయింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, వాహన చోదకుడు పైలెట్ ఏకాంత్ సంఘటన స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆధునిక వైద్య విధానాలతో మెడపట్టి, స్ప్లింటింగ్, ఆక్సిజన్, సెలైన్ అందిస్తూ గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి యువకులను రక్షించిన సత్తుపల్లి 108 సిబ్బందిని ఖమ్మం జిల్లా 108 సర్వీస్ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, రేగళ్లపాడు గ్రామస్తులు మరియు వాహనదారులు అభినందించారు.IMG-20251214-WA0039

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి