రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం!

ఇద్దరు యువకులకు గాయాలు.

రేగళ్లపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం!

సత్తుపల్లి, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్కపురి లోకేష్ (24), ఇలాసారపు పవన్ (23) స్కూటీపై సత్తుపల్లి వైపు వెళ్తుండగా, వెనుక నుంచి మరో బైక్ అతివేగంగా వచ్చి ఢీకొని ఘటన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో లోకేష్‌కు ఎడమ కాలు విరిగిపోగా, పవన్‌కు ఎడమ పాదానికి లోతైన గాయం అయింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ, వాహన చోదకుడు పైలెట్ ఏకాంత్ సంఘటన స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆధునిక వైద్య విధానాలతో మెడపట్టి, స్ప్లింటింగ్, ఆక్సిజన్, సెలైన్ అందిస్తూ గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి యువకులను రక్షించిన సత్తుపల్లి 108 సిబ్బందిని ఖమ్మం జిల్లా 108 సర్వీస్ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, రేగళ్లపాడు గ్రామస్తులు మరియు వాహనదారులు అభినందించారు.IMG-20251214-WA0039

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .