నాచారంలో దోమల నియంత్రణకు చర్యలు

హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువును పర్యవేక్షించిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారంలో దోమల నియంత్రణకు చర్యలు

నాచారం, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో దోమలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువును పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పెద్ద చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిందని, దాని కారణంగానే ఇటీవల కాలంలో దోమల సంఖ్య అధికంగా పెరిగిందని కార్పొరేటర్ గుర్తించారు. వెంటనే గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయాలని ఎస్‌ఈ ఎంటమాలజీ మాధవరెడ్డిని ఫోన్ ద్వారా సూచించారు.దీనికి స్పందించిన ఎస్‌ఈ ఎంటమాలజీ మాధవరెడ్డి, త్వరలోనే ఎఫ్‌టీసీ మిషన్‌ను తీసుకువచ్చి గుర్రపు డెక్కను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ, బీఆర్‌ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, దాసరి కర్ణ, మక్బూల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .