ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్
*కొన్నసాగుతున్న ఓట్ల లెక్కింపు పక్రియ... గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు*
----- *పోలీస్ కమిషనర్ సునీల్ దత్*
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 14,(తెలంగాణ ముచ్చట్లు)
జిల్లాలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు, తీర్థాల, గోళ్ళపాడు, ముదిగొండ, నేలకొడపల్లి, ముజ్జిగుడెం,రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాలను సందర్శించిన
పోలీస్ కమిషనర్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీంచారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కునువినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఒంటి గంట వరకు వచ్చి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టిస్టమైన బందోబస్త్ తో పోలీస్ అధికారులు పర్యవేక్షించారని అన్నారు.
ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు గ్రామాలలో ముందస్తు జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎక్కువ మందిని గుంపులుగా లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే బైండోవర్ చేసినట్లు తెలిపారు.


Comments