పారిశుద్ధ్య కార్మికురాలి భర్త మృతి
మృతుని కుటుంబానికి ముదిరాజ్ యువత ఆర్థిక అండ
Views: 3
On
పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
మదిగట్ల గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గొల్ల లక్ష్మమ్మ భర్త గొల్ల లక్ష్మయ్య శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిరాజ్ సంగం యువకులు మానవతా దృక్పథంతో స్పందించి, తమ వంతు సహాయంగా అందరూ కలిసి రూ.20,500 నగదును సేకరించారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని గొల్ల లక్ష్మమ్మ కి అందజేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ యువత మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే దేవుడు కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువత సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Dec 2025 22:06:53
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...


Comments