ప్రీ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల 

ప్రీ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల 

ఉప్పల్, డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ డివిజన్ కేకేఆర్ గార్డెన్, భరత్ నగర్‌లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థన, అలాగే 14వ సముద్ర జల ప్రవాహాల పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.అనంతరం మాట్లాడిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ—ప్రతి సంవత్సరం హోలీ టెంపుల్ బ్రదర్ జె. తేజు మై వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ క్రిస్మస్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రభువుకు సేవకులు పాల్గొనడం ఆనందకరమన్నారు. ప్రభువు ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.తనను కార్పొరేటర్‌గా నిలబెట్టిన ప్రతి సోదరి, సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ—డివిజన్ పరిధిలోని ప్రతి ప్రార్థన మందిరానికి తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అలాగే, గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతి క్రిస్టియన్ కుటుంబానికి క్రిస్మస్ గిఫ్టులు అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రతి అర్హుడికి క్రిస్మస్ గిఫ్టులు అందేలా చూడాలని కోరారు.కార్యక్రమంలో పాస్టర్ గోనె ఫిలిప్స్, పలు ప్రార్థన మందిరాల పాస్టర్లు మరియు ఇతర విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20251205-WA0202

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి