శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి 

శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి 

పుటాని తండాలో విస్తృత ప్రచారం 

సిపిఐ నాయకులు బానోతు నాగేశ్వరరావు 

ఖమ్మం బ్యూరో, జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)

రఘునాథపాలెంమండల పరిధిలోని పుటానీ తండ గ్రామపంచాయతీలో సిపిఐ 100వ శతాబ్ది ఉత్సాహాలను గ్రామ ప్రజలు సిపిఐ సానుభూతిపరులు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ... పుటాని తండలో సిపిఐ సానుభూతిపరులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వందేళ్ళ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినప్పటి నుండి  అనేక ఉద్యమాలు రైతులు, కార్మికులు కోసం పోరాటాలు చేసిందని వారు తెలియజేశారు. ఆరోజున బైక్ ర్యాలీతో వచ్చే వారు ముందుగా సంప్రదించాలని ఆయన కోరారు. ఈనెల 18న  ఖమ్మంలోని ఎస్ ఆర్ బి జి ఎన్  ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాలను హాజరు కావాలని సభను  జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, బానోత్ కిషన్, బానోతు లక్మా, బానోతు లక్ష్మ, నునావత్ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .