మల్లాపూర్లో సంక్రాంతి సంబరాలు
నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘణంగా పతంగుల పంపిణి
_ప్రత్యేక ఆకర్షణగా “పతంగుల బండి”
మల్లాపూర్, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు)
సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా మల్లాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణి కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన “పతంగుల బండి” మల్లాపూర్ డివిజన్లో బస్తీబస్తీ తిరుగుతూ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
పతంగుల బండి రావడంతో చిన్నారులు ఆనందంతో కేరింతలు వేస్తూ పతంగులు తీసుకున్నారు. యువతీ యువకులు, పెద్దలు సైతం పతంగులు స్వీకరించి సంక్రాంతి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా డివిజన్ మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మల్లాపూర్ డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పతంగులు ఎగరేసే సమయంలో చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించి, ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. సంప్రదాయ పండుగలను భద్రతతో పాటు ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి.జి. సుదర్శన్, బెల్లం గట్టయ్య, తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, దంతూరి రాజు గౌడ్, ముజీబ్, వుండం శ్రీనివాస్, జానీ, కోయలకొండ రాజేష్, మనోహర్, జానీ భాయ్, పర్వతాలు, కంపెల్లి శివ, నిక్కీ గౌడ్, లక్ష్మిపతి, మెహన్, నాగరాజ్, మహేష్, నరేష్ యాదవ్, శేఖర్, వరుణ్ రెడ్డి, దాసరి సాయి, డీజే దినేష్ పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకురాళ్లు సోనీ గౌడ్, ఇష్రత్ బానో, ఇంతియాజ్తో పాటు మల్లాపూర్ యువ నాయకులు బాతరాజు రాహుల్, నెమలి సందీప్, వంగవీటి రింకు, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments