ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ

ఖండాంతారాల్లో సిపిఐ వందేళ్ల పండుగ

ఖమ్మం బ్యూరో, జనవరి 14(తెలంగాణ ముచ్చట్లు)

సిపిఐ శతాబ్ది ఉత్సవాలు భారతదేశంలోనే కాకుండా ఖండాంతారాల్లో సైతం జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలకు చెందిన వారు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నివసిస్తున్న యువకులు సిపిఐ శతాబ్ది సంబురాలను జరుపుతున్నారు. వామపక్ష భావాజాలం కలిగిన యువకులు ఒక చోట పార్టీ చరిత్రను మననం చేసుకుంటూ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ మరింత పురోగమించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ శతాబ్ది ఉత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నారు. సిపిఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్ కె జానిమియా తనయుడు లతీఫ్ పాషా -నేతృత్వంలో లండన్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఇతర దేశాల్లో కూడా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ రానున్న కాలంలో కమ్యూనిస్టులు పురోగమించాలని కమ్యూనిజం మాత్రమే సరైన ప్రత్యామ్నాయం అని విద్యావంతులు చాటిచెబుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .