మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

మేడ్చల్ మల్కాజ్గిరి , జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు)  జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 195వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అధికారులు పూలమా లలు వేసి నివాళులర్పించారు.బాలికల విద్య, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమంలో జిల్లాలోని 13 మంది మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, వారి సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, జిల్లా జీసీడీఓతో పాటు జిల్లాస్థాయి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.వక్తలు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే బాలికల విద్య కోసం చేసిన పోరాటం నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆమె ఆశయాలను ప్రతిఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. IMG-20260103-WA0142

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .