సీసీ రోడ్డు పనులను పరిశీలించిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్

చిల్కానగర్, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)

చిల్కానగర్ డివిజన్ పరిధిలోని బీరప్ప గడ్డ ప్రాంతంలో సుమారు 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ స్థానిక బస్తీ వాసులతో కలిసి పర్యవేక్షించారు.సీసీ రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టర్ ఆలస్యంగా చేపడుతున్నాడని బస్తీ వాసులు చేసిన విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ బస్తీ పర్యటన నిర్వహించి, నిర్మాణ స్థలం నుండే కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పనుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, బస్తీ వాసులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.సంక్రాంతి పండుగ లోపు నూతన రోడ్లపై ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకునే విధంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అలాగే జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ కు కూడా కాంట్రాక్టర్ ద్వారా పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని కోరారు.
అదేవిధంగా బీరప్ప గడ్డ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదురుగా ఉన్న వీధుల్లో చేపడుతున్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులపై కూడా కాంట్రాక్టర్‌తో మాట్లాడి, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. డ్రైనేజీ అనంతరం సీసీ రోడ్డు పనులు కూడా వెంటనే చేపట్టి పూర్తి చేస్తానని, తద్వారా బస్తీ వాసులు సంక్రాంతి పండుగను IMG-20260104-WA0115ఆనందంగా జరుపుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీరప్ప గడ్డ బస్తీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .