ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి  ప్రీతం ను కలిసిన దయ్యాల దాసు

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి  ప్రీతం ను కలిసిన దయ్యాల దాసు

వనపర్తి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర కార్మిక విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దయ్యాల దాసు ఆధ్వర్యంలో మంగళవారం దళిత నాయకులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ను శాలువాతో  సన్మానించారు. అనంతరం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులు చేసిన రుణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని దయ్యాల దాసు  కోరారు.దీనిపై స్పందించిన చైర్మన్ నగరి ప్రీతం ఇదివరకే రూ.2,000 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా రుణాలు అందించే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.రాజీవ్ యువ వికాసం పథకంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా లోన్లు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారని దయ్యాల దాసు తెలిపారు..ఈ కార్యక్రమంలో గద్దల ప్రభాకర్, నిరంజన్, కృష్ణ, దయ్యాల అంజన్న, గుండెల చంద్రమోహన్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .