ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి  ప్రీతం ను కలిసిన దయ్యాల దాసు

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి  ప్రీతం ను కలిసిన దయ్యాల దాసు

వనపర్తి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్ర కార్మిక విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ దయ్యాల దాసు ఆధ్వర్యంలో మంగళవారం దళిత నాయకులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ను శాలువాతో  సన్మానించారు. అనంతరం రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులు చేసిన రుణాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని దయ్యాల దాసు  కోరారు.దీనిపై స్పందించిన చైర్మన్ నగరి ప్రీతం ఇదివరకే రూ.2,000 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా రుణాలు అందించే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.రాజీవ్ యువ వికాసం పథకంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా లోన్లు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారని దయ్యాల దాసు తెలిపారు..ఈ కార్యక్రమంలో గద్దల ప్రభాకర్, నిరంజన్, కృష్ణ, దయ్యాల అంజన్న, గుండెల చంద్రమోహన్, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కృష్ణారెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటన కృష్ణారెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటన
చర్లపల్లి, జనవరి (తెలంగాణ ముచ్చట్లు): ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్ ప్రాంతంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా...
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు
పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ యాత్ర సిగ్గుచేటు
ఉప్పల్ ఓల్డ్ భరత్ నగర్‌కు రూ.13.25 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.!
పిల్లల భద్రతే లక్ష్యం.. బడి బస్సుల తనిఖీలు.