నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు

నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు

పెద్దమందడి,జనవరి7(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలానికి నూతనంగా నియమితులైన ఎస్సై జలంధర్ రెడ్డిని మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ సహకారం ఎంతో అవసరమని సర్పంచ్ రాములు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేందుకు పోలీస్–గ్రామ పాలన మధ్య సమన్వయం ఉండాలని కోరారు.దీనికి స్పందించిన ఎస్సై జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు గ్రామ ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో  గ్రామ మేకల రాములు, ఉప సర్పంచ్ రవి సాగర్, వార్డు సభ్యులు పాలెం రవి, మీసాల బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .