దొడ్ల డైరీ స్టేట్ ఇంచార్జ్పై తల్వార్తో దాడి
తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ – యశోదకు తరలింపు
కీసర, జనవరి 08 (తెలంగాణ ముచ్చట్లు):
దొడ్ల డైరీ పాల్ స్టేట్ ఇంచార్జ్పై బ్రాంచ్ ఇంచార్జ్ తల్వార్తో దాడి చేసిన ఘటన కీసరలో కలకలం రేపింది. ఈ ఘటనలో దొడ్ల డైరీ స్టేట్ ఇంచార్జ్ కొండపాక శ్రీనివాస్ (50) తీవ్రంగా గాయపడ్డారు.పోలీసుల కథనం ప్రకారం… కీసర గ్రామంలోని దొడ్ల పాల్ బ్రాంచ్ ఇంచార్జ్ కిరణ్ అలియాస్ పవన్ కళ్యాణ్ సకాలంలో కంపెనీకి చెల్లించవలసిన డబ్బులు చెల్లించకపోవడంతో, దొడ్ల డైరీ యాజమాన్యం ఫ్రాంచైజీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో స్టేట్ ఇంచార్జ్ కొండపాక శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కీసరలోని దొడ్ల పాల్ బ్రాంచ్కు చేరుకున్నారు. ఈ సమయం లో కిరణ్ అలియాస్ పవన్ కళ్యాణ్ వారితో వాగ్వాదానికి దిగుతూ, ముందుగా తన వాహనంలో తెచ్చుకున్న తల్వార్ను తీసుకుని విచక్షణారహితంగా శ్రీనివాస్పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను వెంటనే చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు కిరణ్ అలియాస్ పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Comments