కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వజ్రెష్ యాదవ్

 కీసర, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ ఆలయానికి చేరుకుని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం నూతన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన తటాకం వెంకటేష్‌కు, అలాగే నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొని, దేవస్థానం అభివృద్ధి దిశగా పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్‌ను ఎంపీ ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. కీసరగుట్టను మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260107-WA0054

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .