ఏసీబీకి చిక్కిన కేయూ ఎస్ఐ శ్రీకాంత్.
రూ.15 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత.
హాసన్ పర్తి,జనవరి 08(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరధిలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కాడు.పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని వేధిస్తూ కేసును తేలిక చేయాలంటే డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం గురువారం రూ.15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐ శ్రీకాంత్ను పట్టుకున్నారు.ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది.అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.


Comments