గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం బృందం

గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సాధించిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం బృందం
ప్రశంస జ్ఞాపికలను అందుకుంటున్న చిన్నారులు

కాజీపేట్, జనవరి 6 (తెలంగాణ ముచ్చట్లు)

 హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం లో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు 5000 మంది కళాకారులతో  కూచిపూడి కళా వైభవం - 2 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాజిపేటకు చెందిన సదాశ్రీ కూచిపూడి కళాక్షేత్రం గురువు రేవతి శిష్య బృందం కూడా పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి హాజరై పిల్లలు అన్ని రంగాలలో రాణించాలని ఈ సందర్భంగా తెలిపారు. పిల్లల్ని ఈ రంగంలో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను గురువులను ఆయన అభినందించారు. అనంతరం గురువులకు పిల్లలకు ప్రశంస జ్ఞాపికలను అందించారు. ఈ అవార్డు రావడం పట్ల స్థానిక లు హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .