ది హెయిర్ బ్లో సెలూన్ ప్రారంభించిన మందుముల పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ భగయత్లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది హెయిర్ బ్లో సెలూన్’ ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి మంగళవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,“సెలూన్ అనేది కేవలం హెయిర్ కట్ లేదా హెయిర్ స్టైల్కు మాత్రమే పరిమితం కాదు. ఇది యువతలో ఆత్మవిశ్వాసం పెంచే, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచే, పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఒక వేదిక” అని పేర్కొన్నారు. ఇలాంటి ఆధునిక వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సెలూన్ యాజమాన్యులు పయ్యావుల మోహన మురళి, పయ్యావుల శ్రీనివాస్, పయ్యావుల భరత్ కుమార్, లింగంపల్లి రామకృష్ణ, సల్ల ప్రభాకర్ రెడ్డి, అలుగుల అనిల్, జనగామ రామకృష్ణ, సురేష్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments