ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు తాళమే దిక్కు.

ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు తాళమే దిక్కు.

పెద్దమందడి,ఆగస్టు13(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజల సౌకర్యార్థం వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. మండల కేంద్రం కావడంతో వివిధ గ్రామాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు బస్టాండ్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఉపయోగపడేలా ప్రభుత్వ నిధులతో ఈ పబ్లిక్ టాయిలెట్‌ను నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయి కొంతకాలం గడుస్తున్నా ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో ప్రజలకు అందుబాటులోకి రాలేదు.బస్టాండ్ ఆవరణలో నిర్మించిన ఈ సౌకర్యం అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌కు తాళం వేసి ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన భవనం వెంటనే వినియోగంలోకి తీసుకురావాల్సి ఉండగా, ప్రారంభోత్సవం జరగకపోవడంతో ప్రభుత్వ నిధులు వెచ్చించినా ప్రజలకు ప్రయోజనం దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.మండల కేంద్రంలోని బస్టాండ్‌కు ప్రతిరోజూ వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ప్రజలకు ఎంతో అవసరమైన పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా తాళం వేసి ఉంచడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.ఈ విషయంపై పంచాయతీరాజ్ ఇంజనీర్ రమేష్ నాయుడును వివరణ కోరగా, పబ్లిక్ టాయిలెట్‌ను ప్రారంభించేందుకు గ్రామ సర్పంచ్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో ప్రారంభోత్సవం జరిగేలా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు. గ్రామ కమిటీల పరిశీలనలో కాంగ్రెస్ నాయకులు.
వేలేరు, ఆగస్టు 13 (తెలంగాణ ముచ్చట్లు): పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా వేలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు పి....
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ.
పూసల సంఘానికి కమ్యూనిటీ హాల్‌ కోసం సీఎం రేవంత్‌రెడ్డికి వినతి.
ఎన్‌ఐఓఎస్‌ ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి ఉత్తీర్ణత.
ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌కు తాళమే దిక్కు.
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.
అమ్మపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం