హుజురాబాద్‌కు కావాల్సింది అభివృద్ధి.. రాజకీయ రచ్చ కాదు.

హుజురాబాద్‌కు కావాల్సింది అభివృద్ధి.. రాజకీయ రచ్చ కాదు.

జమ్మికుంట టౌన్ ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు):

 హుజురాబాద్‌ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు ప్రభుత్వాన్ని, మంత్రులను ఒప్పించి పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకొస్తున్నారని జమ్మికుంట మండల కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీటీసీ వాసాల రామస్వామి అన్నారు. ప్రజలకు అవసరమైన పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కృషి చేయాల్సిన సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అల్లర్లు, గొడవలను ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు.
కౌశిక్‌రెడ్డి రాజకీయ వ్యవహారాల వల్ల హుజురాబాద్‌ ప్రజలు ఏం నేర్చుకోవాలని ఆయన ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేయడం, అధికారులను దూషించడం, రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, మంత్రులు, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అభివృద్ధికి మార్గం కాదన్నారు. ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం, రోడ్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలపై ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌ నాయకులు ఆలోచించాలి
టీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కౌశిక్‌రెడ్డి రాజకీయ విధానాల వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతోందో ఆలోచించాలని వాసాల రామస్వామి అన్నారు. ఆయన రాజకీయ విధానాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గత ఉపఎన్నికల రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఈటల రాజేందర్‌, కేసీఆర్‌ మధ్య రాజకీయ విభేదాల నేపథ్యంలో మూడో వ్యక్తిగా కౌశిక్‌రెడ్డిని హుజురాబాద్‌ ప్రజలపై రుద్దారని విమర్శించారు. ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌కు వెళ్లిపోయారని, ఇప్పుడు కౌశిక్‌రెడ్డిని కూడా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని కేసీఆర్‌, కేటీఆర్‌, వినోద్‌కుమార్‌లను కోరారు.
అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
కౌశిక్‌రెడ్డి చేస్తున్న రాజకీయ గొడవలను హుజురాబాద్‌ ప్రజలు ఇక భరించే పరిస్థితిలో లేరని వాసాల రామస్వామి అన్నారు. హుజురాబాద్‌ను అభివృద్ధి బాటలో నడిపించే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రణవ్‌బాబుకు అండగా నిలిస్తే ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, వ్యక్తిగత రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కౌశిక్‌రెడ్డికి ఆయన హితవు పలికారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ విజయవంతం.
జమ్మికుంట టౌన్, ఆగస్టు 14 (తెలంగాణ ముచ్చట్లు): కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా...
ప్రభుత్వానికి రూ.2.42 కోట్ల నష్టం.. రైస్ మిల్ యజమాని అరెస్ట్.
పోచమ్మ తల్లి ఆలయంలో బోరుబావికి శ్రీకారం.
పేదల సంక్షేమ పథకాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం.
విద్యారంగ సమస్యలపై యూఎస్పీసీ సమరభేరి.
సత్తుపల్లిలో 6.36 కిలోల గంజాయి పట్టివేత.
IIIT సీటు సాధించిన హాసినికి సర్పంచ్ ఆర్థిక సాయం.