ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు టీవీ అందజేత.
ఉప్పల్,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ప్రెస్ క్లబ్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూడూరు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీవీని అందజేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు టీవీని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సౌకర్యార్థం ఉప్పల్ ప్రెస్ క్లబ్కు టీవీ అందించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి సౌకర్యాల మెరుగుదలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల తిరుపతిరెడ్డి,ప్రధాన కార్యదర్శి గ్యారంపల్లి శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పారేల్లి సాగర్, ఉపాధ్యక్షులు ఏవి శ్రీధర్ రావు, కూకుట్ల నరోత్తం రెడ్డి, కోశాధికారి గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీ దాస రాజుతో పాటు సీనియర్ జర్నలిస్టులు దొంతుల వెంకటరామిరెడ్డి, కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, శ్రీశైలం,కోడికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.జర్నలిస్టుల సౌకర్యాల కోసం సహకారం అందించిన పూడూరు జితేందర్ రెడ్డికి, బీఆర్ఎస్ నాయకులకు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments