పొలంలో గుర్తుతెలియని శవం.

పొలంలో గుర్తుతెలియని శవం.

హసన్ పర్తి,జనవరి 07(తెలంగాణ ముచ్చట్లు):

హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామ శివారులో బుధవారం రోజున గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు హసన్ పర్తి ఇన్స్పెక్టర్ వట్టె చేరాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతసాగర్ గ్రామ శివారులోని వట్టే వెంకటరమణారెడ్డి కౌలుకు చేస్తున్న పొలంలో మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు  గుర్తించామని ఇన్స్పెక్టర్ తెలియజేశారు.ఆ వ్యక్తి నలుపు రంగు కోల మొహం కలిగి 40-45 సంవత్సరాలు ఉండవచ్చునని ఎడమ వైపు ఛాతిపై పుట్టుమచ్చ,నలుపు తెలుపు రంగు జుట్టు, ఎరుపు నలుపు తెలుపు రంగుల గల్లల అంగి, కుడి చేతికి చిన్న పూసల దండ, ఎడమ చేయికి నలుపు దారం కలిగి ఉన్నాడని, ప్రాథమిక దర్యాప్తులో అనంతసాగర్ గ్రామస్తులు చెప్పిన వివరాలను బట్టి మతిస్థిమితం సరిగా లేకుండా ముందురోజు గ్రామంలో తిరుగుతుండగా కొంతమంది గమనించినట్లు తెలిపారని కావున అట్టి వ్యక్తి గురించి ఏవైనా అనవాళ్లు తెలిసినట్లయితే హసన్ పోలీస్ స్టేషన్-8712685051, ఎస్సై 8712685097, ఇన్స్పెక్టర్ 8712685124 నెంబర్లకు హసన్ పర్తి  పోలీసులు కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .