నాచారం సర్కిల్ ఏర్పాటు పట్ల అధికారులకు కార్పొరేటర్ కృతజ్ఞతలు 

శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం సర్కిల్ ఏర్పాటు పట్ల అధికారులకు కార్పొరేటర్ కృతజ్ఞతలు 

  నాచారం, డిసెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం లో కొత్తగా ఏర్పాటు చేసిన నాచారం సర్కిల్ పట్ల నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ సంబంధిత ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాచారం ప్రాంత అభివృద్ధికి ఇది కీలకమైన ముందడుగుగా పేర్కొన్నారు.
పాత నాచారం వార్డు కార్యాలయం స్థానంలో సుమారు రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో స్టిల్ + 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ భవనాన్ని నాచారం సర్కిల్ కార్యాలయంగా వినియోగించుకోవాలని అధికారులను ఆమె అధికారికంగా కోరినట్లు తెలిపారు. సర్కిల్ కార్యాలయం నాచారంలో ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందని, ఫిర్యాదులు, అభివృద్ధి పనులు, మున్సిపల్ సేవలు వేగంగా పరిష్కారం అవుతాయని అన్నారు.
నాచారం సర్కిల్ ఏర్పాటుతో పాటు కార్యాలయం కూడా అదే ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రజలకు తిరుగుబాటు తగ్గి సమయసేవలు అందుతాయని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ స్పష్టం చేశారు. అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.IMG-20251227-WA0063

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .