కీసర సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్గా వసంత బాధ్యతలు స్వీకరణ
Views: 89
On
కీసర, డిసెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్ గా వసంత శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం డీసీ వసంత మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలన అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రతి సమస్యపై సత్వర స్పందనతో పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పరిపాలన సాగిస్తామని ఆమె తెలిపారు. కీసర సర్కిల్ను శాంతియుతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజల సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని వసంత స్పష్టం చేశారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments