కీసర సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వసంత బాధ్యతలు స్వీకరణ

కీసర సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌గా వసంత బాధ్యతలు స్వీకరణ

కీసర, డిసెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర సర్కిల్‌కు నూతన డిప్యూటీ కమిషనర్‌ గా వసంత శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత ఉన్నతాధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం డీసీ వసంత మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పాలన అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రతి సమస్యపై సత్వర స్పందనతో పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పరిపాలన సాగిస్తామని ఆమె తెలిపారు. కీసర సర్కిల్‌ను శాంతియుతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగంతో పాటు ప్రజల సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని వసంత స్పష్టం చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .