కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిళ్ల వేలం
Views: 18
On
కుషాయిగూడ, జనవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో కార్గో ద్వారా పంపించి గడువు మించిపోయినప్పటికీ తీసుకెళ్లని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుషాయిగూడ ఆర్టీసీ డిపో గేటు ఆవరణలో ఈ వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేలంలో పాల్గొని, గడువు మించిన కార్గో పార్సిళ్లను పొందవచ్చని డిపో మేనేజర్ సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
08 Jan 2026 22:11:38
ఖమ్మం బ్యూరో, జనవరి 8(తెలంగాణ ముచ్చట్లు)
బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం నాడు జిల్లాలో పర్యటించారు....


Comments