అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
ఆరోగ్య లక్ష్మి కమిటీ ఏర్పాటు
వనపర్తి,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని 3వ అంగన్వాడి కేంద్రాన్ని సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీని ఏర్పాటు చేసి, కేంద్ర నిర్వహణ, పిల్లల హాజరు,పోషకాహార పంపిణీ వ్యవస్థపై సమగ్రంగా పరిశీలించారు.అంగన్వాడి కేంద్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందా అనే అంశాలపై సర్పంచ్ ఆరా తీశారు. అలాగే పోషకాహారం సరఫరా విధానం, నాణ్యత,నిర్వహణపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు గర్భిణీ స్త్రీలకు బాలామృతం, గుడ్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు ప్రతి నెల ప్రభుత్వం ద్వారా అందే పాలు, గుడ్లు, బాలామృతాన్ని సకాలంలో తీసుకొని, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతిరోజూ అంగన్వాడి కేంద్రానికి పంపించాలని సర్పంచ్ సూచించారు.పిల్లల ఆరోగ్యం, పోషణ గ్రామ అభివృద్ధికి పునాదని పేర్కొన్న సర్పంచ్, అంగన్వాడి కేంద్రాల పనితీరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గణేష్ నాయకులు,ఎస్.రాములు,పోతుల రామిరెడ్డి,రామకృష్ణారెడ్డి, శ్రీ బోయిన కృష్ణ,బాలాజీ,ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments