బండారి లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన చిల్కానగర్ డివిజన్ పాస్టర్లు

బండారి లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన చిల్కానగర్ డివిజన్ పాస్టర్లు

చిల్కానగర్, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చిల్కానగర్ డివిజన్ పరిధిలోని వివిధ చర్చిల పాస్టర్లు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజు, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాస్టర్లు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజులపై ఆ ఏసుప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించి, కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.అదనంగా, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాస్టర్లకు నూతన దుస్తులు, క్రిస్మస్ గిఫ్టులు ఎంతో దయా హృదయంతో పంపిణీ చేస్తున్నందుకు గాను పాస్టర్లు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ ఏసుప్రభు ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ పాస్టర్లు గోనె ఫిలిప్స్, జెరూసలెం మత్తయ్య, మనోహర్, జాకోబ్ రాజు, నటానియల్, ఇమాన్యుల్, తేజు మై తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం