కుషాయిగూడ–నేరేడ్మెట్ పోలీసుల సంయుక్త వాహన తనిఖీలు

సైనిక్‌పురి ఎక్స్‌ రోడ్‌ వద్ద విస్తృత తనిఖీలు

కుషాయిగూడ–నేరేడ్మెట్ పోలీసుల సంయుక్త వాహన తనిఖీలు

కుషాయిగూడ, జనవరి 03 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ మరియు నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సైనిక్‌పురి ఎక్స్‌ రోడ్‌ వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.తనిఖీల సందర్భంగా వాహనదారుల లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు తదితరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని చట్టబద్ధమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వాహన తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం
వనపర్తి,జనవరి4(తెలంగాణ ముచ్చట్లు): భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే సైన్స్ ఒక్కటే ప్రధాన ఆధారమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి...
వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
జమ్మిగడ్డలో బిఆర్‌ఎస్ నాయకురాలు శేరి మణెమ్మ సేవా కార్యక్రమం
మున్నూరు కాపులు ఐక్యతతో కలిసికట్టుగా ముందుకుసాగాలి  పుట్ట పురుషోత్తం రావు
పెద్ద చెరువుకట్టపై శుభ్రత పనులను పరిశీలిం చిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
అభివృద్ధే శ్వాసగా పనిచేయండి
పదేళ్లలో పేదోడికి గూడు ఇవ్వని దౌర్భాగ్య ప్రభుత్వం