పెండింగ్‌లో ఉన్న లెప్రసీ డబ్బులు విడుదల చేయాలి

పెద్దమందడిలో ఆశ కార్యకర్తల ధర్నా

పెండింగ్‌లో ఉన్న లెప్రసీ డబ్బులు విడుదల చేయాలి

పెద్దమందడి,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని ఆశ కార్యకర్తలకు సంబంధించిన 2025 కుష్టు డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.అనంతరం డాక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కుష్టు డబ్బులను వెంటనే విడుదల చేయాలని, డిసెంబర్‌లో నిర్వహించే కుష్టు సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఆశ కార్యకర్తలకు నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పల్స్ పోలియో, గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫిక్స్‌డ్ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించి, కేంద్రం పెంచిన పారితోషకాలను రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశ కార్యకర్తలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు ప్రకటించాలని కోరారు. అలాగే డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏఎన్‌సీపీ, ఎన్‌సీ తదితర టార్గెట్లను రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఆశ కార్యకర్తలకు రూ.5 లక్షల రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న పారితోషికంలో సగాన్ని పెన్షన్‌గా నిర్ణయించి అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు డి. గిరిజ, ఉపాధ్యక్షురాలు బాల మన్నెమ్మ, కార్యదర్శి భారతి, సహాయ కార్యదర్శి కాజమ్మ, కోశాధికారి పోషమ్మ, ఎం. రాధా, నారాయణమ్మ, సి. రాధా, సరస్వతి, ఉమాదేవి, మమత, వి. రాధ, సుగుణమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన వార్డు సభ్యులకు ఘన సన్మానం
అడ్డాకల్,జనవరి5(తెలంగాణ ముచ్చట్లు): మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్నగర్ జిల్లా  అడ్డకల్ మండల కేంద్రంలో మహిళా సమైక్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల...
బీసీ భవన నిర్మాణానికి అనుమతి.!
గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన మణిగిల్ల సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్
ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.
కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి.
భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సైన్స్ కీలకం