ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.

ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.

దమ్మపేట, జనవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామంలో కుంజా దావీదు–పార్వతి దంపతుల కుమార్తె తేజశ్రీ, కుమారుడు ప్రణయ్‌కుమార్‌ల ఓణీల మరియు పంచకట్టు వేడుకలు బంధుమిత్రుల మధ్య ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పాల్గొని, దమ్మపేట మండలం మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావుతో కలిసి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు మంచి సంస్కారాలు, ఉత్తమ విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకురాలు వగ్గేల పూజ, పార్కెలగండి గ్రామ సర్పంచ్ కొమరం సుశీల, బిఆర్ఎస్ యువజన నాయకులు కాకా శివశంకర్ ప్రసాద్, పద్దం అశోక్‌తో పాటు గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.! ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె.!
- పల్లెల్లో విస్తృత ప్రచారం చేయాలి. - సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు. సత్తుపల్లి, జనవరి 7 (తెలంగాణ ముచ్చట్లు): మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక...
పిల్లల భద్రతే లక్ష్యం.. బడి బస్సుల తనిఖీలు.
రేపు గంగారం లో విద్యుత్ వినియోగదారుల సదస్సు.
ఐడిబిఐ బ్యాంకు సహకారంతో తాటికాయల ప్రైమరీ పాఠశాలలో వాటర్ ప్యూరిఫైయర్ ప్రారంభం
జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థిని
బీసీలకు చట్టబద్ధమైన “బీసీ సబ్ ప్లాన్” అమలు చేయాలి
కీసరగుట్ట దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం