ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.

ఓణీల–పంచకట్టు వేడుకల్లో చిన్నారులను ఆశీర్వదించిన సోయం వీరభద్రం.

దమ్మపేట, జనవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కెలగండి గ్రామంలో కుంజా దావీదు–పార్వతి దంపతుల కుమార్తె తేజశ్రీ, కుమారుడు ప్రణయ్‌కుమార్‌ల ఓణీల మరియు పంచకట్టు వేడుకలు బంధుమిత్రుల మధ్య ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో అశ్వరావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పాల్గొని, దమ్మపేట మండలం మాజీ సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావుతో కలిసి చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు మంచి సంస్కారాలు, ఉత్తమ విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకురాలు వగ్గేల పూజ, పార్కెలగండి గ్రామ సర్పంచ్ కొమరం సుశీల, బిఆర్ఎస్ యువజన నాయకులు కాకా శివశంకర్ ప్రసాద్, పద్దం అశోక్‌తో పాటు గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .