రైతులను సన్మానించిన బ్యాంక్ అధికారులు.

రైతులను సన్మానించిన బ్యాంక్ అధికారులు.

హాసన్ పర్తి, డిసెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):

 రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని హసన్ పర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని రైతులను బ్యాంక్ మేనేజర్ సకులాల్ లకావత్ కార్తీక్ సన్మానించారు.ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అభివందనమని పేర్కొన్నారు. ప్రతి రైతు దేశానికి గర్వకారణమని,రైతులు ఉత్పత్తి దారులనుండి నుండి వ్యవస్థాపకులుగా మారాలని కోరారు.బ్యాంక్ అందిస్తున్న కిసాన్ సమృద్ధి పథకం,దీర్ఘ,స్వల్పకాలిక పంట రుణాలు గురించి రైతులకు వివరించారు.సకాలంలో రుణాలను చెల్లించినట్లయితే కలిగే ప్రయోజనాలను,రుణం తీసుకొని మరణించిన రైతుల రుణ విముక్తి విదానాలను వివరించారు.
బ్యాంకుల అందిస్తున్న వివిధ రుణ సదుపాయాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు పరిధిలోని ఎనిమిది గ్రామాల నుండి 50 మంది రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కుషాయిగూడ లో ఫంక్షన్ హాల్ యజమానులతో పోలీసులు సమావేశం కుషాయిగూడ లో ఫంక్షన్ హాల్ యజమానులతో పోలీసులు సమావేశం
_రాత్రి 10 తర్వాత శబ్ద కాలుష్యం, బాణాసంచాపై కఠిన చర్యలు: పోలీసులు కుషాయిగూడ, జనవరి 07 (తెలంగాణ ముచ్చట్లు): మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్...
బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి
కృష్ణారెడ్డి నగర్‌లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటన
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన రజిత పరమేశ్వర్ రెడ్డి
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన మద్దిగట్ల సర్పంచ్ మేకల రాములు
పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ యాత్ర సిగ్గుచేటు
ఉప్పల్ ఓల్డ్ భరత్ నగర్‌కు రూ.13.25 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు