రైతులను సన్మానించిన బ్యాంక్ అధికారులు.

రైతులను సన్మానించిన బ్యాంక్ అధికారులు.

హాసన్ పర్తి, డిసెంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు):

 రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని హసన్ పర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోని రైతులను బ్యాంక్ మేనేజర్ సకులాల్ లకావత్ కార్తీక్ సన్మానించారు.ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అభివందనమని పేర్కొన్నారు. ప్రతి రైతు దేశానికి గర్వకారణమని,రైతులు ఉత్పత్తి దారులనుండి నుండి వ్యవస్థాపకులుగా మారాలని కోరారు.బ్యాంక్ అందిస్తున్న కిసాన్ సమృద్ధి పథకం,దీర్ఘ,స్వల్పకాలిక పంట రుణాలు గురించి రైతులకు వివరించారు.సకాలంలో రుణాలను చెల్లించినట్లయితే కలిగే ప్రయోజనాలను,రుణం తీసుకొని మరణించిన రైతుల రుణ విముక్తి విదానాలను వివరించారు.
బ్యాంకుల అందిస్తున్న వివిధ రుణ సదుపాయాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు పరిధిలోని ఎనిమిది గ్రామాల నుండి 50 మంది రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .