ఉప్పల్ లో  సీనియర్ సిటిజన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ఉప్పల్ లో  సీనియర్ సిటిజన్స్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ఉప్పల్, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదివారం రాత్రి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్‌తో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వృద్ధులకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై వారి సూచనలు, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను సకాలంలోనే పరిష్కరిస్తామని పరమేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెంకటయ్య గౌడ్, షేర్ నరసింహ రెడ్డి, నారాయణ గౌడ్, పాపి రెడ్డి, మోరే అంజి రెడ్డి, మందముల అంజి రెడ్డి, వీరేశం గుప్తా, లింగా రెడ్డి, సి.హెచ్. పురుషోత్తం రెడ్డి, వెంకటేశం, పి. జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .