ప్రమాణ స్వీకారోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు

ప్రమాణ స్వీకారోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

ధర్మసాగర్,డిసెంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

ధర్మసాగర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు తెలిపారు.ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, పూర్తి క్రమశిక్షణతో జరగాలన్నారు. ఈ సందర్భంగా డీజేలు, భారీ శబ్ద వ్యవస్థలు వినియోగించరాదని, అలాగే ర్యాలీలు నిర్వహించడం, రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
పోలీసు శాఖ జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించి ప్రమాణ స్వీకారోత్సవాలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం