శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి విశేష స్పందన

శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైద్య శిబిరానికి విశేష స్పందన

నాచారం, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం ప్రాంతంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని సత్య సాయి బాబా సేవ సమితి, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో దాదాపు 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందించారు. అదనంగా కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉచిత కంటి అద్దాలు కూడా పంపిణీ చేశారు.ఉచితంగా వైద్యం, మందులు, కంటి అద్దాలు అందించడంపై స్థానిక పేద ప్రజలు నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం నాచారం  అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, అధ్యక్షుడు బండల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బొగ్గారపు రమేష్, కోశాధికారి ఎగిన భాస్కర్, ఉపాధ్యక్షుడు గౌరి శెట్టి నరేందర్, సలహాదారులు జూలూరి శ్రీనివాస్, ఎం. రమేష్, జాయింట్ సెక్రటరీ గుండా మహేశ్వమూర్తి, మీడియా కోఆర్డినేటర్ ఆకుతోటి హరిష్ పాల్గొన్నారు.
అలాగే కార్యవర్గ సభ్యులు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, సాయి బాబా, శ్రీశైలం, వైద్యులు డా. రాజేంద్ర ప్రసాద్, డా. ఉపేందర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం