జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు

జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు

ధర్మసాగర్,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత ప్రాజెక్టులు మరియు చార్టుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత నమూనాలు, చార్టులు, వర్కింగ్ మోడళ్లు అందరి ప్రశంసలు పొందాయి.
ఈ కార్యక్రమాన్ని గణిత ఉపాధ్యాయురాలు  కిరణ్మయీ సమర్థవంతంగా సమన్వయం చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించే విధంగా ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.కార్యక్రమానికి ప్రధానోపన్యాసాన్ని ప్రధానోపాధ్యాయులు కె.బి. ధర్మ ప్రకాశ్  అందిస్తూ, గణిత శాస్త్రం దైనందిన జీవితంలో ఉన్న ప్రాధాన్యతను వివరించి, విద్యార్థులు తార్కిక ఆలోచన అలవర్చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  కవిత,  రాజమ్మ,  పద్మజ,   IMG-20251222-WA0193రామకృష్ణ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .