ఉపసర్పంచ్‌,వార్డు సభ్యులను  సన్మానించిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్

ఉపసర్పంచ్‌,వార్డు సభ్యులను  సన్మానించిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్

ధర్మసాగర్,డిసెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):

తాటికాయల గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణతో పాటు వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్క రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని నాయకులు సూచించారు.ఈ సందర్భంగా భాస్క రవీందర్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా అని, పంచాయతీ పాలకవర్గానికి పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.సన్మాన కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెసరు శివకృష్ణతో పాటు వార్డు సభ్యులు పెసరు స్వామి, దువ్వల సుమన్,పిట్టల బిట్టు,పెసరు కృష్ణవేణి,బొల్లెపాక అనిత సంపత్, పట్ల యాదమ్మ రాంచందర్, పట్ల రమేష్ పాల్గొన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్థులు హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం