నాచారం ఐడీఏలో మహిళా కార్మికులు  ధర్నా

వేధింపులు ఆపాలి ,కనీస వేతనం పెంచాలి , ఓటీ మొత్తం చెల్లించాలి

నాచారం ఐడీఏలో మహిళా కార్మికులు  ధర్నా

నాచారం, డిసెంబర్‌ 08 (తెలంగాణ ముచ్చట్లు) :

నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ టెక్స‌టైల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ యూనిట్‌ ఎదురుగా సోమవారం ఉదయం నుంచి సుమారు వెయ్యికి పైగా మహిళా కార్మికులు అకస్మాత్తుగా మెరుపు ధర్నా చేపట్టారు.పరిశ్రమలో జరుగుతున్న వేధింపులను అరికట్టాలని, కనీస వేతనం రూ.15,000 అమలు చేయాలని, చేసిన ఓవర్‌టైమ్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షుడు కోమటి రవి హాజరై మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానాలను దృష్టిలో ఉంచుకొని కనీస వేతనం రూ.26,000 కన్నా తక్కువ కావొద్దని పేర్కొన్నారు. తరువాత కార్మికుల సమక్షంలో హెచ్‌ఆర్ ప్రతాపరెడ్డి, మేనేజర్ స్వప్నతో చర్చలు జరిగాయి.ఓటీ బకాయిలను సమీక్షించి చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. వేధింపులపై విచారణకు అంగీకరించినా, వేతన పెంపు విషయంలో నిర్ణయం వెల్లడించలేదు.
ఈ సమాధానంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేతనం పెంచే వరకు ధర్నా కొనసాగిస్తామని ప్రకటించారు.
అంతకుముందు యాజమాన్యంతో చర్చలకు వెళ్లిన కార్మిక సంఘం కమిటీ సభ్యులకు ప్రమోషన్‌ల రూపంలో ప్రలోభాలు ఇచ్చారని కార్మికులు ఆరోపించారు.ధర్నాకు సంఘీభావం తెలుపుతూ
సీఐటీయూ, ఏఐటీయూసీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్‌.ఎస్‌ ప్రభాకర్లు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సీఐటీయూ అశోక్ రెడ్డి, ఉపేందర్, ప్రభాకర్, ఏఐవైఎఫ్ గిరిబాబు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ స్వప్న, ఏఐఎస్ఎఫ్ హాజీమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం