బ్యాంకును మోసం చేసిన ముగ్గురిపై కేసు.!

సత్తుపల్లి, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకును మోసం చేసిన ఘటనలో సదాశివునిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ జంగం కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు… సదాశివునిపాలెం గ్రామానికి చెందిన కాల్నెని రాజేశ్ (ఏ–1), కాల్నెని నాగమణి (ఏ–2), కాల్నెని కుమారి (ఏ–3) అనువారు తుంబూరు రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు.
ఈ రుణానికి సంబంధించి ప్రస్తుతం రూ.63,31,269 బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే, బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా అదే భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇతర వ్యక్తులకు విక్రయించి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు నమ్మకద్రోహం, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .