బ్యాంకును మోసం చేసిన ముగ్గురిపై కేసు.!

సత్తుపల్లి, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకును మోసం చేసిన ఘటనలో సదాశివునిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తుపల్లి డీసీసీబీ బ్యాంకు మేనేజర్ జంగం కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు… సదాశివునిపాలెం గ్రామానికి చెందిన కాల్నెని రాజేశ్ (ఏ–1), కాల్నెని నాగమణి (ఏ–2), కాల్నెని కుమారి (ఏ–3) అనువారు తుంబూరు రెవెన్యూ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు.
ఈ రుణానికి సంబంధించి ప్రస్తుతం రూ.63,31,269 బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే, బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా అదే భూమిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇతర వ్యక్తులకు విక్రయించి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు నమ్మకద్రోహం, మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాడు భర్త… నేడు భార్య నాడు భర్త… నేడు భార్య
కరుణాపురం 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా ప్రమాణస్వీకారం ధర్మసాగర్,డిసెంబర్23(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం గ్రామంలో 1వ వార్డు మెంబర్‌గా రాజారపు రమా సోమవారం అధికారికంగా...
జెడ్పిహెచ్ఎస్ (బాయ్స్) ధర్మసాగర్‌లో గణిత దినోత్సవ వేడుకలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి
శాలపల్లి సర్పంచ్ గా కూరపాటి అశోక్ ప్రమాణ స్వీకారం
టెక్నాలజీ ఆధారిత ‘సిటిజన్–ఫస్ట్’ పోలీసింగ్‌లో రాచకొండ కొత్త బెంచ్‌మార్క్
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
వివాహేతర సంబంధమే హత్యకు కారణం