మేడ్చల్ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన

అదనపు కలెక్టర్ రాధిక గుప్తా

మేడ్చల్ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసిన

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’’ కార్యక్రమం లో భాగంగా మంగళవారం ఐడీఓసీ సముదాయం ఆవరణలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం, ప్రజా పాలన బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలు ప్రజలకు మరింత సేవ అందించేలా రూపుదిద్దుకున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి,శ్యామ్ ప్రకాష్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.ప్రత్యేకంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు ఆలపించిన ప్రజా పాలన, ప్రభుత్వ సంక్షేమం పై పాటలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. IMG-20251209-WA0004

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .