పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన

ఏసీపీ రూరల్ తిరుపతిరెడ్డి

పంచాయతీ ఎన్నికలపై ప్రజలకు అవగాహన

ఖమ్మం బ్యూరో, నవంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలని ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతిరెడ్డి తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముదిగొండ  గ్రామ ప్రజలతో మమేకమై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని, ప్రజా రక్షణ, భద్రత పోలీసుల లక్ష్యమని అన్నారు. గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.IMG-20251128-WA0009

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!