కల్లూరు మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల తుది జాబితా విడుదల.

కల్లూరు మున్సిపాలిటీలో ముసాయిదా ఓటర్ల తుది జాబితా విడుదల.

- మొత్తం ఓటర్లు 18,866.

- మహిళలే అధికం.

సత్తుపల్లి, జనవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):

కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల తుది జాబితాను మున్సిపల్ కమిషనర్ ఎం. రామచంద్రరావు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,866గా నమోదైనట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ తుది ముసాయిదా జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు మొత్తం 40 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ఓటర్లలో మహిళలు 9,785 మంది ఉండగా, పురుష ఓటర్లు 9,081 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .