ఆర్టీఐ యాక్టివిటీస్ ఫోరం సహకారంతో మహిళా సంఘంలో మందలలిత చేరిక

ఆర్టీఐ యాక్టివిటీస్ ఫోరం సహకారంతో మహిళా సంఘంలో మందలలిత చేరిక

అడ్డాకల్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

ఆర్టీఐ యాక్టివిటీస్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మంగరాయి వెంకటేష్ సహాయంతో బలీదుపల్లి గ్రామానికి చెందిన మందలలితను మహిళా సంఘంలో చేర్చారు. రెండు నెలల క్రితం ఆర్థిక సహాయం కోరుతూ మహబూబ్‌నగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశాల మేరకు మహిళా సంఘంలో చేర్చాలని సూచనలు జారీ అయ్యాయి.ఈ ఆదేశాల ప్రకారం అడ్డాకుల మండల ఏపీఎం మహేష్ సూచనతో శుక్రవారం వీఏఓ శ్రీధర్ బలీదుపల్లి గ్రామంలోని మందలలిత స్వగృహంలో నూతనంగా ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా విలేజ్ బుక్ కీపర్ శ్రీధర్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మహిళా సంఘాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి మహిళ మహిళా సంఘంలో చేరి పొదుపు అలవాటు చేసుకోవాలని, ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలను ఏర్పాటు చేసిందని వివరించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతూ కుటుంబ అవసరాలు, పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా మందలలిత, కార్యదర్శిగా సుజాతను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మహిళా సంఘాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా బలోపేతం కావాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు