పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డిని కలిసిన వెల్టూర్ సర్పంచ్ అశోక్

పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డిని కలిసిన వెల్టూర్ సర్పంచ్ అశోక్

పెద్దమందడి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పెద్దమందడి ఎస్ఐ జలంధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామంలోని శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా, వెల్టూర్ గ్రామంలో రెండు మూడు రోజుల్లో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ అశోక్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలోని ముఖ్య కూడళ్లతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని ద్వారా నేరాల నివారణతో పాటు ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.పోలీస్–గ్రామ పాలన మధ్య సమన్వయంతో పనిచేస్తేనే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పవచ్చని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శాంతిభద్రతలకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజల సహకారంతో మండల పరిధిలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ ఉపసర్పంచ్ నాగమణి నరేష్, వార్డు సభ్యులు జోగు వెంకటేష్, పట్నం సత్యన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు