సత్తుపల్లి డిపోలో ఘనంగా డ్రైవర్స్ డే వేడుకలు.

సత్తుపల్లి డిపోలో ఘనంగా డ్రైవర్స్ డే వేడుకలు.


IMG-20260124-WA0036

సత్తుపల్లి, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):

డ్రైవర్స్ డే సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఏకాగ్రతతో వాహనం నడిపితే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని డ్రైవర్లకు స్పష్టం చేశారు. ఉదయం 5 గంటల నుంచే సత్తుపల్లి డిపోలో ప్రతి డ్రైవర్‌కు గులాబీ పూలు అందజేసి డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ సంస్థ ఆదాయం పెంపునకు కృషి చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి. ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్. సాహితి సహా ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .