అనారోగ్య బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత

మణిగిల్ల కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి శివ యాదవ్ 

అనారోగ్య బాధితుడికి రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత

వనపర్తి,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

ఖిల్లా ఘణపూర్ మండలం సోలిపూర్ గ్రామానికి చెందిన జనగే చంద్రమౌళి (తండ్రి: జె. నరసింహ) అనారోగ్యంతో బాధపడుతుండగా..ఈ విషయం తెలుసుకున్న కంటెస్టెడ్ సర్పంచ్ మణిగిల్ల శివ యాదవ్ వెంటనే స్పందించారు. బాధితుడిని పరామర్శించి, పరిస్థితిని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చంద్రమౌళిని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి, బుచ్చన్న నాయుడు  సహకారంతో రూ.2 లక్షల 50 వేల విలువైన ఎల్ఓసిని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఎల్ఓసి ద్వారా బాధితుడికి అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా చంద్రమౌళి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అనారోగ్య సమయంలో తమను ఆదుకున్న  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సహాయానికి చొరవ తీసుకున్న కంటెస్టెడ్ సర్పంచ్ శివ యాదవ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మణిగిల్ల గ్రామ పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పెద్దమందడి,జనవరి26(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని  పాఠశాల మరియు అంగన్‌వాడీ సెంటర్ల చిన్నపిల్లల స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ నూతన సర్పంచ్...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ప్రతి భారతీయుడు కృతజ్ఞతలు తెలుపాలి
గార్లపాడు గ్రామ జాతీయ జెండా ఆవిష్కరించిన డిఐజి శ్రీనివాస్ రెడ్డి
"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన   రాజోలి గ్రామ సర్పంచ్ చింపుల  గంగిరెడ్డి 
‘నా దేశం – నా బాధ్యత’ నినాదంతో గణతంత్ర వేడుకలు
యువతలో జాతీయ స్పూర్తి నింపిన గణతంత్ర దినోత్సవం
ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు